TTD: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేంద్రమంత్రి పీయూష్ గోయల్

  • ఈ తెల్లవారుజామున స్వామి వారి అభిషేకంలో పాల్గొన్న కేంద్రమంత్రి
  • మంత్రి వెంట రాష్ట్ర మంత్రి మేకపాటి గౌతం రెడ్డి
  • కేంద్రంతో సత్సంబంధాలను కొనసాగిస్తామని స్పష్టీకరణ

రైల్వే మంత్రి పీయూష్ గోయల్ ఈ తెల్లవారుజామున తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామి వారి అభిషేకంలో పాల్గొన్నారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి టీటీడీ జీఈవో స్వాగతం పలికారు. స్వామి వారి దర్శనానంతరం మంత్రికి రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం పలికారు. అనంతరం శేషవస్త్రంతో సత్కరించారు. తీర్థ ప్రసాదాలను అందజేశారు.

మంత్రి గోయల్ వెంట రాష్ట్ర మంత్రి మేకపాటి గౌతం రెడ్డి కూడా కూడా ఉన్నారు. ఈ సందర్భంగా గౌతం రెడ్డి మాట్లాడుతూ.. కేంద్రంతో సత్సంబంధాలను కొనసాగిస్తామన్నారు. ప్రత్యేక హోదా అంశాన్ని పీయూష్ గోయల్ ద్వారా కేంద్రం దృష్టికి తీసుకెళ్తామన్నారు.

More Telugu News