Neeti Ayog: 15న రాష్ట్రపతి భవన్‌లో ప్రధాని అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం

  • పలు కీలక అంశాలపై చర్చ
  • హాజరుకానున్న అన్ని రాష్ట్రాల సీఎంలు తదితరులు
  • సమావేశానంతరం విందు ఇవ్వనున్న ప్రధాని

ఈ నెల 15న నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన రాష్ట్రపతి భవన్‌లో జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ జరగనుంది. ముఖ్యంగా ట్రాన్స్ పార్మింగ్ అగ్రికల్చర్, ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రాం, వర్షపు నీటి సంరక్షణ, భద్రతా పరమైన అంశాలు, కరువు పరిస్థితి, ఎసెన్షియల్ కమోడిటీస్ చట్టం, ఏక్ భారత్ శ్రేష్ట్ అంశాలపై చర్చించనున్నారు. ఈ సమావేశంలో కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, నీతి ఆయోగ్ ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. వీరందరికీ సమావేశానంతరం ప్రధాని విందు ఇవ్వనున్నారు.

More Telugu News