an 32: విమానం కూలిపోయిన ఘటనలో ఏ ఒక్కరూ బతకలేదు: ఇండియన్ ఎయిర్ ఫోర్స్

  • 3వ తేదీన అరుణాచల్ ప్రదేశ్ లో కూలిపోయిన వాయుసేన విమానం
  • విమానంలోని 13 మంది దుర్మరణం
  • విషయాన్ని మృతుల కుటుంబీకులందరికీ తెలియజేశామన్న ఎయిర్ ఫోర్స్

అరుణాచల్ ప్రదేశ్ లో ఏఎన్-32 విమానం కూలిపోయిన ఘటనలో ఏ ఒక్కరూ బతకలేదని భారతీయ వాయుసేన ప్రకటించింది. ఈ విషయాన్ని తెలియజేయడానికి చింతిస్తున్నామని తెలిపింది. ఈ ఉదయం ఎనిమిది మందితో కూడిన తమ సెర్చ్ టీమ్ ప్రమాద స్థలికి చేరుకుందని... ప్రాణాలతో బయటపడిన వారెవరినీ తమ సెర్చ్ టీములు గుర్తించలేదని ఎయిర్ ఫోర్స్ తెలిపింది. ఇదే విషయాన్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబీకులందరికీ తెలియజేశామని చెప్పారు. ఈ నెల 3వ తేదీన భారతీయ వాయుసేనకు చెందిన ఈ విమానం కూలిపోయిన సంగతి తెలిసిందే.

More Telugu News