Crime News: పదో తరగతి విద్యార్థిని బలవన్మరణం...పాఠశాల మేడపై నుంచి దూకి ఆత్మహత్య

  • హైదరాబాద్‌ నాగోలు సమీపంలో ఘటన
  • ఈరోజు ఉదయం ఎనిమిది గంటల సమయంలో ఘోరం
  • పాఠశాల సిబ్బంది ఆసుపత్రికి తరలించినా దక్కని ప్రాణం

పాఠశాలలు పునఃప్రారంభమైన రెండో రోజే హైదరాబాద్‌ నగరంలో విషాదం చోటుచేసుకుంది. పదో తరగతి చదువుతున్న ఓ బాలిక మేడపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈరోజు ఉదయం 8 గంటల సమయంలో జరిగిన ఈ దుర్ఘటన స్థానికంగా సంచలనమయింది.

వివరాల్లోకి వెళితే...నగరంలోని తట్టిఅన్నారం సమీపంలోని హనుమాన్‌నగర్‌లో నివాసం ఉంటున్న నరసింగరావు కుమార్తె (14) నాగోలులోని సాయినగర్‌ కాలనీలో ఉన్న ఓ ప్రైవేటు పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. ఈరోజు ఉదయం 7.30 గంటల సమయంలో ఇంటి నుంచి పాఠశాలకు బయలుదేరింది. పాఠశాలకు వచ్చాక భవనం మూడో అంతస్తుకు వెళ్లింది. అక్కడి నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ హఠాత్పరిణామంతో అవాక్కయిన పాఠశాల సిబ్బంది హుటాహుటిన ఆమెను సమీపంలోని కామినేని ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ చనిపోయింది.

More Telugu News