Akbaruddin Owaisi: అక్బరుద్దీన్ త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నా!: టీడీపీ అధినేత చంద్రబాబు

  • అనారోగ్యంతో బాధపడుతున్న అక్బరుద్దీన్
  • లండన్ లోని ఆసుపత్రిలో చికిత్స
  • ట్విట్టర్ లో స్పందించిన టీడీపీ అధినేత

తెలంగాణలో మజ్లిస్ పార్టీ శానససభా పక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ ఆరోగ్యం ఇటీవల విషమించిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన్ను లండన్ లోని ఓ ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు. తాజాగా అక్బరుద్దీన్ అనారోగ్యంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. అక్బరుద్దీన్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు చంద్రబాబు చెప్పారు. ఆయనకు భగవంతుడు ఆయురారోగ్యాలను ప్రసాదించాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు చంద్రబాబు ట్వీట్ చేశారు.

More Telugu News