Putta: పుట్టా సుధాకర్ యాదవ్ పై ఆరోపణలతో ప్రభుత్వానికి నివేదిక అందజేసిన టీటీడీ

  • దేవాదాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి నివేదిక సమర్పణ
  • స్విమ్స్ డైరెక్టర్ ఫిర్యాదును ప్రస్తావించిన టీటీడీ
  • టీటీడీ చైర్మన్ పదవి నుంచి తప్పుకునేది లేదన్న పుట్టా

టీటీడీ చైర్మన్ పదవి నుంచి వైదొలగేది లేదు, దమ్ముంటే బోర్డును రద్దు చేస్కోండి అంటూ టీడీపీ నేత పుట్టా సుధాకర్ యాదవ్ సవాలు విసరడం తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఆయనపై టీటీడీనే స్వయంగా ఓ నివేదిక రూపొందించి ప్రభుత్వానికి సమర్పించింది. స్విమ్స్ లో ఉద్యోగ నియామకాలపై సంస్థ డైరక్టర్ పై ఒత్తిడి తీసుకువచ్చారని, గవర్నింగ్ కౌన్సిల్, ఎగ్జిక్యూటివ్ కమిటీ తీర్మానాలకు వ్యతిరేకంగా పనిచేయాలంటూ ఒత్తిడి చేశారని ఆ నివేదికలో పేర్కొన్నారు. ఈ మేరకు స్విమ్స్ డైరెక్టర్ ఫిర్యాదు చేసినట్టు కూడా నివేదికలో తెలిపారు. రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్ సింగ్ కు ఈ నివేదికను సమర్పించారు.

More Telugu News