Tollywood: ఆసుపత్రిపాలైన టాలీవుడ్ దర్శకుడు రాజ్ కిరణ్

  • గుండెపోటుకు గురైన రాజ్ కిరణ్
  • వెంటనే ఆసుపత్రికి తరలింపు
  • నిలకడగా ఆరోగ్యం

తెలుగులో గీతాంజలి, లక్కున్నోడు, త్రిపుర వంటి విభిన్న కథా చిత్రాల దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు రాజ్ కిరణ్ ఆసుపత్రి పాలయ్యారు. రాజ్ కిరణ్ ఇవాళ ఓ మోస్తరు గుండెపోటుకు గురికావడంతో ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు. కూకట్ పల్లిలోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో రాజ్ కిరణ్ ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు తెలుస్తోంది. కాగా, రాజ్ కిరణ్ ప్రస్తుతం 'విశ్వామిత్ర' అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఎల్లుండి విడుదల అవుతోంది.

More Telugu News