raghuram rajan: యూకేలో కీలక పదవికి పోటీ పడుతున్న ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్

  • బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ గవర్నర్ పదవికి పోటీ
  • అక్టోబర్ 31లోపు జరగనున్న నియామకం
  • ఇంత వరకు స్పందించని రాజన్

ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ యూకేలో కీలక పదవికి పోటీ పడుతున్నారు. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ గవర్నర్ పదవికి పోటీ పడుతున్న ముఖ్యమైన వ్యక్తుల్లో ఒకరిగా ఉన్నారు. ఈ విషయాన్ని బ్లూమ్ బర్గ్ వెల్లడించింది. గతంలో ఐఎంఎఫ్ లో కూడా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. బ్రెగ్జిట్ నేపథ్యంలో ప్రస్తుత బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ గవర్నర్ మార్క్ కార్నే స్థానంలో కొత్త వ్యక్తిని ఎంపిక చేయనున్నారు. అక్టోబర్ 31లోపు ఈ నియామకం జరగబోతోంది. ఈ పదవి కోసం పోటీ పడుతున్న వ్యక్తులలో యూకే వెలుపలి వ్యక్తి రాజన్ ఒక్కరే అని సమాచారం. అయితే ఈ అంశంపై బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ కానీ, రాఘురాం రాజన్ కానీ ఇంత వరకు స్పందించలేదు.

More Telugu News