world cup: వరల్డ్ కప్.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పాకిస్థాన్

  • టాంటస్ వేదికగా కొద్ది సేపట్లో ప్రారంభం కానున్న మ్యాచ్
  • ఆస్ట్రేలియా, పాకిస్థాన్ జట్లకు ప్రధాన బలం బ్యాటింగే
  • గెలుపు కోసం ఉవ్విళ్లూరుతున్న ఇరు జట్లు

వరల్డ్ కప్ లో భాగంగా ఆస్ట్రేలియా, పాకిస్థాన్ జట్ల మధ్య పోరు ప్రారంభం కానుంది. మ్యాచ్ లో భాగంగా టాస్ గెలిచిన పాకిస్థాన్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇంగ్లాండ్ లోని టాంటస్ వేదికగా కొద్ది సేపట్లో ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఆస్ట్రేలియా, పాకిస్థాన్ రెండు జట్లకు ప్రధాన బలం బ్యాటింగే. భారత్ చేతిలో ఓటమిపాలై నిరాశతో ఉన్న ఆసీస్ జట్టు ఈ మ్యాచ్ లో గెలుపు కోసం చూస్తోంది. అదే విధంగా, పాక్ జట్టు కూడా తన సత్తా చాటి విజయం దక్కించుకోవాలని తహతహలాడుతోంది.

More Telugu News