jagan: కాళేశ్వరం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా జగన్ ను ఆహ్వానించనున్న కేసీఆర్

  • ఈ నెల 21న కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం
  • ముఖ్య అతిథిగా జగన్ ను పిలవాలని నిర్ణయించిన కేసీఆర్
  • విజయవాడకు వెళ్లి స్వయంగా ఆహ్వానించనున్న టీఎస్ సీఎం

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టును ఈ నెల 21న ప్రారంభించనున్నారు. టీఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ప్రాజెక్టును ప్రారంభించబోతున్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను ముఖ్య అతిథిగా ఆహ్వానించాలని కేసీఆర్ నిర్ణయించారు. అంతేకాదు, త్వరలోనే విజయవాడకు వెళ్లి జగన్ ను కేసీఆర్ స్వయంగా ఆహ్వానించనున్నారు.

More Telugu News