raviteja: 'మహాసముద్రం' కోసం రంగంలోకి దిగనున్న రవితేజ

  • 'ఆర్ ఎక్స్ 100'తో హిట్
  • తదుపరి చిత్రంగా 'మహాసముద్రం'
  • త్వరలోనే సెట్స్ పైకి

'ఆర్ ఎక్స్ 100' సినిమాతో దర్శకుడిగా అజయ్ భూపతి తన సత్తా చాటుకున్నాడు. ఈ సినిమాతో యూత్ లో ఆయనకి మంచి క్రేజ్ పెరిగింది. దాంతో ఆయన తదుపరి సినిమాపై వాళ్లంతా ఆసక్తిని కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అజయ్ భూపతి 'మహాసముద్రం' అనే కథను సిద్ధం చేసుకున్నాడు.

నాగచైతన్యతో ఈ కథను సెట్స్ పైకి తీసుకెళ్లాలని అనుకున్నాడు. కొన్ని కారణాల వలన ఆ ప్రయత్నం ఫలించకపోవడంతో, రవితేజను ఒప్పించాడు. ప్రస్తుతం 'డిస్కోరాజా' చేస్తోన్న రవితేజ, ఆ సినిమా షూటింగు పూర్తయ్యేలోగా ఈ ప్రాజెక్టును పూర్తి స్థాయిలో సెట్ చేసి పెట్టమని చెప్పాడట. దాంతో అందుకు సంబంధించిన పనులతో అజయ్ భూపతి బిజీగా వున్నాడట. సంగీత దర్శకుడు చైతన్ భరద్వాజ్ ఇప్పటికే రెండు ట్యూన్స్ ఓకే చేయించుకున్నాడని సమాచారం.

More Telugu News