Andhra Pradesh: అక్బరుద్దీన్ జీ త్వరగా కోలుకోవాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా!: ఏపీ సీఎం జగన్

  • అనారోగ్యంతో చికిత్స పొందుతున్న అక్బరుద్దీన్
  • లండన్ లోని ఆసుపత్రిలో ప్రత్యేక చికిత్స
  • ట్విట్టర్ లో స్పందించిన ఏపీ ముఖ్యమంత్రి

మజ్లిస్ పార్టీ శానససభాపక్ష నేత, చంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ఇటీవల అనారోగ్యంతో లండన్ లోని ఓ ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇటీవల ఆరోగ్యం విషమించడంతో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ స్పందించారు. అక్బరుద్దీన్ త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఈ మేరకు సీఎం జగన్ ట్వీట్ చేశారు.

More Telugu News