Narendra Modi: మోదీ అధ్యక్షతన ఈ నెల 15న నీతి ఆయోగ్ సమావేశం... సీఎంలందరికీ ఆహ్వానం

  • ఐదు అంశాలతో అజెండా
  • రాష్ట్రపతి భవన్ లోని సాంస్కృతిక కేంద్రంలో భేటీ నిర్వహణ
  • ఒక్కో ముఖ్యమంత్రి మాట్లాడేందుకు ఐదు నిమిషాల సమయం

ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ నెల 15న దేశ రాజధాని ఢిల్లీలో నీతి ఆయోగ్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ మేరకు దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కేంద్రం నుంచి ఆహ్వానాలు వెళ్లాయి. రాష్ట్రపతి భవన్ లో ఉన్న సాంస్కృతిక కేంద్రంలో ఈ సమావేశం జరగనుంది. ఈసారి నీతి ఆయోగ్ సమావేశంలో ఐదు అంశాలను ప్రస్తావించనున్నారు. వర్షపు నీటి సంరక్షణ, కరవు పరిస్థితులు-ఉపశమన చర్యలు, సాగు విధానంలో మార్పులు-సంస్కరణలు, తీవ్రవాద ప్రాబల్య ప్రాంతాలు, భద్రతా అంశాలు ఈ సమావేశంలో చర్చించనున్నారు. కాగా, ఈ భేటీలో ఒక్కో ముఖ్యమంత్రికి ప్రసంగించేందుకు ఐదు నిమిషాల సమయం కేటాయించారు.

More Telugu News