Chandrababu: పార్టీ ముఖ్య నేతలతో సమావేశమైన చంద్రబాబు.. కీలక విషయాలపై చర్చ

  • అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సి వ్యూహంపై చర్చ
  • తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్న చంద్రబాబు
  • పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై దిశా నిర్దేశం

పార్టీ ముఖ్య నేతలతో ఏపీ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కీలక విషయాలపై చర్చించనున్నట్టు తెలుస్తోంది. ఈ భేటీలో త్వరలో జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం, తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై నేతలకు దిశా నిర్దేశం చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ సమావేశానికి టీడీపీ ముఖ్య నేతలు నిమ్మకాయల చినరాజప్ప, యనమల రామకృష్ణుడు, అచ్చెన్నాయుడు, దేవినేని ఉమ, కనకమేడల రవీంద్రకుమార్, పంచుమర్తి అనురాధ తదితరులు హాజరయ్యారు.

More Telugu News