Hyderabad: అక్బరుద్దీన్ త్వరగా కోలుకోవాలి: రేవంత్ రెడ్డి

  • నా మంచి మిత్రుడు అక్బరుద్దీన్ ఆరోగ్యం మెరుగుపడాలి
  • అక్బరుద్దీన్ అసెంబ్లీలో త్వరగా అడుగుపెట్టాలి
  • తెలంగాణ ప్రజల సమస్యలపై గళం విప్పాలని ఆకాంక్షిస్తున్నా

చాంద్రాయణగుట్ట ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ తీవ్ర అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే. వైద్య సేవల నిమిత్తం లండన్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. అక్బరుద్దీన్ ఆరోగ్యం మెరుగుపడాలని ఇప్పటికే పలువురు రాజకీయనేతలు ఆకాంక్షిస్తూ ట్వీట్స్ చేశారు. తాజాగా, టీ-కాంగ్రెస్ ఎంపీ, వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి స్పందించారు. అక్బరుద్దీన్ ఆరోగ్యం మెరుగుపడాలని  ప్రార్థిస్తున్నామని అన్నారు. అక్బరుద్దీన్ వెంటనే కోలుకుని తెలంగాణ ప్రజల సమస్యలపై అసెంబ్లీలో త్వరలోే ఆయన గళం విప్పాలని కోరుకుంటున్నట్టు రేవంత్ పేర్కొన్నారు.

More Telugu News