MS Dhoni: ఐసీసీ ఒత్తిడికి తలొగ్గిన ధోనీ!

  • బలిదాన్ చిహ్నం లేని గ్లోవ్స్ తో బరిలోకి
  • బలిదాన్ గుర్తుపై ఐసీసీ అభ్యంతరం
  • అసంతృప్తి వ్యక్తం చేసిన బీసీసీఐ

టీమిండియా వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ గ్లోవ్స్ క్రికెట్ వర్గాల్లో తీవ్రచర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ధోనీ కీపింగ్ గ్లోవ్స్ పై పారా మిలిటరీ బలగాల స్మారక చిహ్నం బలిదాన్ ఉండడం పట్ల ఐసీసీ అభ్యంతరం వ్యక్తం చేసింది. గ్లోవ్స్ పై బలిదాన్ గుర్తు ఉండడం నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేసింది. దీనిపై బీసీసీఐ వివరణ ఇచ్చినా ఐసీసీ ససేమిరా అనడంతో ధోనీ బలిదాన్ చిహ్నంలేని గ్లోవ్స్ తో బరిలో దిగాడు. ఇవాళ ఆస్ట్రేలియాతో మ్యాచ్ లో ధోనీ గ్లోవ్స్ పై బలిదాన్ గుర్తు ఎక్కడా కనిపించలేదు.

More Telugu News