Chandrababu: చంద్రబాబు తాను తవ్వుకున్న గోతిలో తానే పడ్డారు: కిషన్ రెడ్డి

  • చంద్రబాబును రాష్ట్ర ప్రజలు ఎన్నటికీ క్షమించరు
  • టీడీపీలో ఎన్టీఆర్ ఆశయాలు లేవు
  • ఎన్టీఆర్ ఆశయాలను రాహుల్ గాంధీకి తాకట్టు పెట్టారు

కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి ఇవాళ ఏపీలో అడుగుపెట్టారు. రేణిగుంటలో ప్రధాని నరేంద్ర మోదీకి స్వాగతం పలికేందుకు వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో చంద్రబాబు తాను తవ్వుకున్న గోతిలో తానే పడ్డారని వ్యంగ్యం ప్రదర్శించారు. ఇప్పుడు బీజేపీపై విషప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. నేటి టీడీపీలో ఎన్టీఆర్ ఆశయాలు లేనేలేవని, ఉన్నదల్లా నారావారి ఆశయాలేనంటూ చంద్రబాబుపై పరోక్ష విమర్శ చేశారు.

ఎన్నికల సందర్భంగా ఎన్టీఆర్ ఆశయాలను రాహుల్ గాంధీకి తాకట్టు పెట్టారంటూ కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. చంద్రబాబును ఏపీ ప్రజలు ఎన్నటికీ క్షమించబోరని అన్నారు. అయితే, ఏపీ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని, ఏపీని అన్ని విధాలుగా ఆదుకుంటామని కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు. కాగా, కిషన్ రెడ్డి కుటుంబ సమేతంగా ఇవాళ తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్నారు.

More Telugu News