Rammohan Naidu: భార్యతో కలిసి భారత్ - ఆస్ట్రేలియా మ్యాచ్‌లో సందడి చేస్తున్న ఏపీ ఎంపీ

  • మ్యాచ్‌ను నేరుగా వీక్షిస్తున్న రామ్మోహన్ నాయుడు
  • ఫోటోలను అభిమానులతో పంచుకున్న ఎంపీ
  • టీమిండియాకు ఆల్ ది బెస్ట్ చెబుతూ పోస్ట్

భారత్ - పాక్ మ్యాచ్ తరువాత క్రికెట్ ప్రేమికులు భారత్- ఆస్ట్రేలియా మ్యాచ్‌ను అమితంగా ఇష్టపడతారు. ప్రపంచకప్‌లో భాగంగా నేడు భారత్ - ఆస్ట్రేలియాల మధ్య మ్యాచ్‌ ఇంగ్లండ్‌లోని ఓవల్ మైదానంలో జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో తెలుగు రాష్ట్రాలకు చెందిన సినీ, రాజకీయ ప్రముఖులు సందడి చేస్తున్నారు.

టీడీపీ ఎంపీ రామ్మోహన్‌నాయుడు తన భార్య శ్రావ్యతో కలిసి మ్యాచ్‌ను నేరుగా వీక్షిస్తున్నారు. ఈ సందర్భంగా తీసుకున్న ఫోటోలను సామాజిక మాధ్యమాల ద్వారా ఆయన అభిమానులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా టీమిండియాకు ఆల్‌ ది బెస్ట్ చెబుతూ పోస్ట్ పెట్టారు. మరో వైపు ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న మహేశ్ బాబు కూడా తన కుటుంబంతో కలిసి మ్యాచ్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు.

More Telugu News