Talasani: ఏపీలో మంత్రివర్గ కూర్పు అద్భుతంగా ఉంది: తలసాని

  • అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చారు
  • బీసీలకు, దళితులకు క్యాబినెట్ లో అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం బాగుంది
  • జగన్ క్యాబినెట్ కు శుభాకాంక్షలు

ఏపీలో సీఎం జగన్ నాయకత్వంలో కొలువుదీరిన కొత్త క్యాబినెట్ పై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశంసల జల్లు కురిపించారు. ఏపీలో కొత్త మంత్రివర్గ కూర్పు అద్భుతంగా ఉందని కితాబిచ్చారు. అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యం దక్కినట్టు కనిపిస్తోందని అన్నారు. ముఖ్యంగా, దళితులకు, బీసీలకు క్యాబినెట్ లో  పెద్దపీట వేశారంటూ తలసాని హర్షం వ్యక్తం చేశారు. ఏపీలో రానున్న ఐదేళ్లకాలంలో జగన్ సర్కారు సుపరిపాలన అందించాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. ఏపీలో కొత్తగా మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.

More Telugu News