kotak mahindra bank: కొటక్ మహీంద్రా బ్యాంకుకు భారీ పెనాల్టీ విధించిన ఆర్బీఐ

  • ప్రమోటర్ల వాటాల విలీనం విషయంలో నిబంధనల ఉల్లంఘన 
  • బ్యాంకు సమాధానాన్ని పరిశీలించిన తర్వాత నిర్ణయం 
  • రూ. 2 కోట్ల పెనాల్టీ విధింపు 

ప్రమోటర్ల వాటాలకు సంబంధించి సరైన సమాచారం అందించలేదనే కారణంగా కొటక్ మహీంద్రా బ్యాంకుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీ షాక్ ఇచ్చింది. రూ. 2 కోట్ల పెనాల్టీ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ప్రమోటర్ల వాటాల విలీనం విషయంలో తమ నిబంధనలను, సూచనలను పాటించలేదని ఈ సందర్భంగా ఆర్బీఐ తెలిపింది.

బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం 1949లోని నిబంధనల ప్రకారం ఈ పెనాల్టీ విధిస్తున్నట్టు వెల్లడించింది. నిబంధనలు ఉల్లంఘించినందుకు జరిమానా ఎందుకు విధించకూడదో తెలపాలంటూ షోకాజ్ నోటీసును జారీ చేశామని... బ్యాంకు నుంచి వచ్చిన సమాధానాన్ని పరిశీలించిన తర్వాత జరిమానా విధించాలని నిర్ణయించామని తెలిపింది.

More Telugu News