prabhas: 'సాహో' డిస్ట్రిబ్యూషన్ హక్కుల కోసం దిల్ రాజు భారీ ఆఫర్?

  • సుజిత్ దర్శకత్వంలో 'సాహో'
  • డిస్ట్రిబ్యూషన్ హక్కుల కోసం పోటీ
  •  ఆగస్టు 15వ తేదీన విడుదల   

ప్రభాస్ కథానాయకుడిగా సుజిత్ దర్శకత్వంలో 'సాహో' రూపొందుతోంది. చిత్రీకరణపరంగా ఈ సినిమా చివరిదశకు చేరుకుంది. యూవీ క్రియేషన్స్ వారు నిర్మిస్తోన్న ఈ సినిమాలో కథానాయికగా శ్రద్ధా కపూర్ నటిస్తోంది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండటంతో, డిస్ట్రిబ్యూషన్ హక్కుల కోసం పోటీ పెద్ద ఎత్తున వున్నట్టుగా తెలుస్తోంది.

నైజామ్ .. ఉత్తరాంధ్ర ఏరియాల డిస్ట్రిబ్యూషన్ హక్కులు తనకి ఇవ్వమంటూ దిల్ రాజు 45 కోట్లను ఆఫర్ చేసినట్టుగా ఒక వార్త వినిపిస్తోంది. ఈ స్థాయిలో పోటీపడే డిస్ట్రిబ్యూటర్స్ లేకపోవడం వలన, ఈ ఏరియాల్లో డిస్ట్రిబ్యూషన్ హక్కులు దిల్ రాజుకి ఖాయమైనట్టేనని అంటున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఆగస్టు 15వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఇక ప్రస్తుతం ప్రభాస్ చేస్తోన్న సినిమాలు పూర్తయిన తరువాత, ఆయనతో దిల్ రాజు ఒక సినిమా ప్లాన్ చేయనున్నాడనే టాక్ కూడా బలంగా వినిపిస్తోంది.

More Telugu News