virat kohli: మంచి నీటితో కార్లు కడిగిన వైనం.. కోహ్లీకి జరిమానా

  • కోహ్లీ నివాసం ఉంటున్న ప్రాంతంలో నీటి కొరత
  • మంచి నీటితో కార్లు కడుగుతున్నారంటూ మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు
  • రూ. 500 జరిమానా విధించిన అధికారులు

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి గురుగ్రామ్ మున్సిపల్ అధికారులు షాకిచ్చారు. వివరాల్లోకి వెళ్తే, విరాట్ కోహ్లీ నివాసం ఉంటున్న గురుగ్రామ్ లో నీటి కొరత తీవ్రంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కోహ్లీ ఇంట్లో మంచి నీటితో కార్లు కడుగుతుండటాన్ని చూసిన ఒక వ్యక్తి... దాన్ని వీడియో తీసి, మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశాడు. నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న తరుణంలో... మంచి నీటిని వృథా చేస్తున్నారంటూ ఫిర్యాదులో తెలిపాడు. ఈ ఫిర్యాదుపై స్పందించిన అధికారులు... నిబంధనల మేరకు కోహ్లీకి రూ. 500 జరిమానా విధిస్తూ నోటీసులు పంపారు.

More Telugu News