Medak District: అదృష్టం ఆమె తలుపుతట్టింది...లాటరీలో ఎంపీపీగా ఎన్నికైన కాంగ్రెస్ సభ్యురాలు

  • మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ మండలాధ్యక్షురాలిగా హలావత్‌ జ్యోతి
  • కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌కు చెరో ఐదు ఎంపీటీసీ స్థానాలు
  • దీంతో అనివార్యమైన డ్రా

రాజకీయాల్లో అందలం దక్కాలంటే ప్రజాభిమానంతోపాటు కాస్త అదృష్టం కూడా కలిసి రావాలంటారు. ఇందుకు మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ మండలాధ్యక్షురాలిగా ఎంపికైన హాలావత్‌ జ్యోతి ఉదాహరణ. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌  పార్టీకి ప్రజా తీర్పు అనుకూలంగానే ఉన్నా అవసరమైన పూర్తి బలం రాకపోవడంతో చివరికి అదృష్టాన్నే నమ్ముకోక తప్పలేదు . అనుకున్నట్టే లాటరీలో అదృష్టం ఆమెనే వరించింది. పదవి దక్కింది.

 వివరాల్లోకి వెళితే...నర్సాపురం మండలంలో మొత్తం పది ఎంపీపీటీసీ స్థానాలున్నాయి. కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ చెరో ఐదు స్థానాలు దక్కించుకున్నాయి. బలం సమానంగా ఉన్నందున ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ, కో ఆప్షన్‌ సభ్యులను లాటరీ పద్ధతిలో ఎన్నుకోవాలని అధికారులు నిర్ణయించారు. నర్సాపూర్‌లోని మండల పరిషత్‌ కార్యాలయంలో లాటరీ తీశారు. అదృష్టం కాంగ్రెస్‌ ఎంపిటీసీ సభ్యురాలు హలావత్‌ జ్యోతి తలుపుతట్టింది. దీంతో పదవిపై బోలెడు ఆశలు పెట్టుకున్న టీఆర్‌ఎస్‌ నాయకురాలు, చిప్పల్‌తుర్తి ఎంపీటీసీ సభ్యురాలు సంధ్యారాణినాయక్‌కు నిరాశే ఎదురైంది. అయితే ఉపాధ్యక్షుడు, కో ఆప్షన్‌ సభ్యుడి పదవులు మాత్రం అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి దక్కడంతో ఆ పార్టీ నాయకులు కొంత ఊరట చెందారు.

More Telugu News