gopichand: 'బంగారు బుల్లోడు'గా కనిపించనున్న యాక్షన్ హీరో

  • తిరు దర్శకత్వంలో గోపీచంద్ 
  • 50 శాతానికి పైగా చిత్రీకరణ పూర్తి
  •  గోపీచంద్ సరసన ఇద్దరు హీరోయిన్లు

తెలుగు తెరపై యాక్షన్ హీరోగా ఎక్కువ మార్కులు కొట్టేసిన గోపీచంద్, ఆ తరువాత ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా థియేటర్స్ కి రప్పించే కథలను చేస్తూ వస్తున్నాడు. తాజాగా ఆయన తమిళ దర్శకుడు 'తిరు'తో ఒక సినిమా చేస్తున్నాడు. యాక్షన్ తో కూడిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రూపొందుతోంది.

ఇప్పటికే ఈ సినిమా 50 శాతానికి పైగా చిత్రీకరణ పూర్తయింది. ఈ సినిమాకి 'బంగారు బుల్లోడు' టైటిల్ ను పరిశీలిస్తున్నట్టుగా సమాచారం. దాదాపు ఇదే టైటిల్ ను ఖరారు చేయనున్నారని అంటున్నారు. తనను ప్రేమించిన అమ్మాయిని సొంతం చేసుకోవడం కోసం కథానాయకుడు ఎలాంటి సాహసాలు చేశాడనే కథాంశంతో ఈ సినిమా నిర్మితమవుతోందట. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు గోపీచంద్ సరసన అలరించనున్నట్టుగా సమాచారం

More Telugu News