MS Dhoni: ధోనీ గ్లౌజ్ లపై ఆర్మీ సింబల్ తొలగించాలని ఆదేశాలు!

  • ధోనీ గ్లౌజులపై 'బలిదాన్' గుర్తు
  • ధోనీ దేశభక్తిపై సోషల్ మీడియా ప్రశంసలు
  • నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేసిన ఐసీసీ

భారత వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ, గ్లౌజులపై ఉన్న 'బలిదాన్' గుర్తును తొలగించాలని ఐసీసీ స్ట్రాటజిక్ కమ్యూనికేషన్స్ జనరల్ మేనేజర్ క్లయిర్ ఫోర్లాంగ్ ఆదేశించారు. ధోనీ గ్లౌజులపై భారత సైన్యానికి చెందిన సింబల్ సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ధోనీ దేశభక్తిపరుడని సోషల్ మీడియా ప్రశంసల జల్లు కురిపించింది. అయితే, ఇలా సైన్యానికి చెందిన గుర్తులను వేసుకోవడం ఐసీసీ నిబంధనలకు విరుద్ధమని, అందుకే దాన్ని తొలగించాలని కోరామని క్లయిర్ తెలిపారు. నిబంధనలను ఉల్లంఘించినందుకు ధోనీకి శిక్ష వేయబోవడం లేదని, తొలి ఉల్లంఘన కాబట్టి, గుర్తును తొలగించాలని మాత్రమే కోరామని ఆయన అన్నారు. టెరిటోరియల్ ఆర్మీ పారాచూట్ రెజిమెంట్ లో ధోనీ లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో వున్నాడు. 

More Telugu News