Mahesh Babu: బాలకృష్ణ కోసం అనుకున్న కథనే మహేశ్ కి సెట్ చేశాడట!

  • అనిల్ రావిపూడితో మహేశ్ బాబు
  •  కీలక పాత్రల్లో విజయశాంతి - జగపతి
  •  త్వరలోనే సెట్స్ పైకి

మహేశ్ బాబు కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమా రూపొందనుంది. ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో మహేశ్ బాబు ఆర్మీ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. రష్మిక మందన కథానాయికగా నటించనున్న ఈ సినిమాలో, విజయశాంతి .. జగపతిబాబు పవర్ఫుల్ పాత్రలను పోషించనున్నారు.

 ఈ సినిమాకి సంబంధించిన ఒకవార్త తాజాగా ఫిల్మ్ నగర్లో షికారు చేస్తోంది. బాలకృష్ణ 100వ సినిమా సమయంలో ఆయనకి అనిల్ రావిపూడి ఒక కథను వినిపించాడు. ఆ కథ బాలకృష్ణకి నచ్చిందిగానీ, అప్పట్లో ఆ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. బాలకృష్ణ తన 100వ సినిమాగా 'గౌతమీ పుత్రశాతకర్ణి' చేయడం .. ఆ తరువాత ఇతర ప్రాజెక్టులతో బిజీకావడం జరిగింది. అప్పట్లో బాలకృష్ణకి వినిపించిన కథనే మహేశ్ బాబుకి తగినట్టుగా అనిల్ రావిపూడి మార్చాడనీ, అదే 'సరిలేరు నీకెవ్వరు'గా రూపొందనుందని అంటున్నారు. ఈ ప్రచారంపై అనిల్ రావిపూడి ఎలా స్పందిస్తాడో చూడాలి మరి. 

More Telugu News