Kesineni Nani: పోరాడితే పోయేదేమీ లేదు... బానిస సంకెళ్లు తప్ప: కేశినేని నాని ఆసక్తికర పోస్ట్!

  • లోక్ సభ విప్ పదవిని వద్దన్న నాని
  • నిన్న చంద్రబాబుతో చర్చలు
  • శ్రీశ్రీ మాటలను గుర్తు చేస్తూ తాజా పోస్ట్

టీడీపీ అధినేత ఇవ్వజూపిన లోక్ సభ విప్ పదవిని వద్దని కలకలం రేపి, ఆపై చంద్రబాబుతో రెండు గంటల పాటు చర్చించి, తనకు ఏ పదవీ వద్దని, పార్టీలోనే ఉంటానని స్పష్టం చేసిన విజయవాడ ఎంపీ కేశినేని నాని, ఈ ఉదయం తన ఫేస్ బుక్ ఖాతాలో ఓ ఆసక్తికర ట్వీట్ పెట్టారు. శ్రీశ్రీ రచనల్లోని ఎంతో పాప్యులర్ అయిన వాక్యం "పోరాడితే పోయేదేమి లేదు. బానిస సంకెళ్ళు తప్ప..." అని పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ వెంటనే వైరల్ అయింది. దీన్ని చూసిన ఆయన అభిమానులు కేశినేని ఏదో అసంతృప్తితో ఉన్నారని, కీలక నిర్ణయం ఏదో తీసుకోనున్నారని కామెంట్లు చేస్తున్నారు.

More Telugu News