Andhra Pradesh: పోలీసులకు వీక్లీ ఆఫ్.. పరిశీలనకు అధికారులతో కమిటీని నియమించిన సీఎం జగన్!

  • వారానికి ఓరోజు సెలవిస్తామన్న జగన్
  • ఎన్నికల హామీని నెరవేర్చే దిశగా అడుగులు
  • కమిటీ నివేదిక ఆధారంగా తుది నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేళ పోలీసులకు వారానికి ఓరోజు సెలవు ఇస్తామని వైసీపీ అధినేత, ప్రస్తుత ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విషయంపై ముఖ్యమంత్రి జగన్ దృష్టి సారించారు.

ఈరోజు డీజీపీ గౌతమ్ సవాంగ్ తో భేటీ అనంతరం వీక్లీ ఆఫ్ పై అధ్యయనం కోసం ముఖ్యమంత్రి ఓ కమిటీని నియమించారు. అదనపు డీజీ రవిశంకర్ అయ్యంగార్ నేతృత్వంలో ఈ కమిటీని ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కమిటీ సమర్పించే నివేదిక ఆధారంగా పోలీసులకు వీక్లీ ఆఫ్ పై ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నాయి.

More Telugu News