Virat Kohli: సెంటిమెంట్ ఫలిస్తే కోహ్లీ సెంచరీ, విజయం మనదేనట!

  • ఇప్పటివరకూ రెండు వరల్డ్ కప్ లు ఆడిన కోహ్లీ
  • రెండింటిలోనూ తొలి మ్యాచ్ లలో సెంచరీ
  • ఆ మ్యాచ్ లలో గెలిచిన భారత్

నేడు సౌతాఫ్రికాతో వరల్డ్ కప్ క్రికెట్ పోరులో భాగంగా భారత్ తొలి మ్యాచ్ ని ఆడనున్న వేళ, ఓ ఆసక్తికర సెంటిమెంట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కోహ్లీ, ఇప్పటివరకూ రెండు వరల్డ్ కప్ లు ఆడాడన్న సంగతి చాలామందికి తెలుసు. ఈ రెండు వరల్డ్ కప్ లలోనూ భారత జట్టు, తన తొలి మ్యాచ్ లలో విజయం సాధించగా, ఈ రెండింటిలోనూ కోహ్లీ సెంచరీలు కొట్టాడు.

2011లో బంగ్లాదేశ్ తో మీర్ పూర్ లో జరిగిన మ్యాచ్ లో 83 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. ఆ మ్యాచ్ లో భారత్ గెలిచింది. ఇక, 2015లో ఆడిలైడ్ లో పాకిస్థాన్ తో భారత్ తొలి మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్ లో 126 బంతుల్లో కోహ్లీ 107 పరుగులు చేశాడు. ఇక నేటి మ్యాచ్ లో కూడా ఆనవాయితీగా వచ్చిన తొలి మ్యాచ్ సెంచరీని కోహ్లీ సాధిస్తాడని, భారత విజయం కూడా ఖాయమని అభిమానులు అంటున్నారు.

More Telugu News