Andhra Pradesh: టీటీడీ చైర్మన్ రేసులో మోహన్ బాబు.. వార్తలపై క్లారిటీ ఇచ్చిన వైసీపీ నేత

  • జగన్ ను సీఎంగా చూడాలన్నదే కోరిక
  • అందుకే నావంతు ప్రయత్నం చేశాను
  • జగన్ ప్రజల సీఎం అవుతాడని నమ్మకం

తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) బోర్డు చైర్మన్ పదవికి ప్రముఖ నటుడు మోహన్ బాబు రేసులో ఉన్నట్లు మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో మోహన్ బాబు ఈ వార్తలపై స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు.

‘వైఎస్ జగన్ ను ఏపీ ముఖ్యమంత్రిగా చూడాలన్నదే నా కోరిక. అందుకే ఆ దిశగా నా వంతు ప్రయత్నం చేశాను. జగన్ ప్రజల సీఎం అవుతారన్న నమ్మకంతోనే నేను రాజకీయాల్లోకి తిరిగి వచ్చా. అంతేతప్ప నామినేటెడ్ పదవులు, వేరేవాటి కోసం కాదు’ అని స్పష్టం చేశారు. ఈ మేరకు మోహన్ బాబు ట్వీట్ చేశారు.

More Telugu News