Andhra Pradesh: రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు

  • సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకున్న సీఎం
  • ఈద్ ముబారక్ చెప్పిన చంద్రబాబు
  • ట్విట్టర్ లో స్పందించిన ఇరువురు నేతలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈరోజు ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ పర్వదినం నేపథ్యంలో అందరి కుటుంబాలు సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఈ మేరకు ముఖ్యమంత్రి ట్వీట్ చేశారు.

మరోవైపు టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబు స్పందిస్తూ..‘సత్ప్రవర్తన, నియమనిష్టలతో కూడిన జీవనవిధానానికి మార్గం చూపిన ఖురాన్ ఆవిష్కృతమైన పవిత్ర మాసం రంజాన్. నెలరోజుల ఉపవాస దీక్షలు ముగించుకుని ఈరోజు పండుగ చేసుకుంటున్న ముస్లిం సోదరులకు #EidMubarak’ అని ట్వీట్ చేశారు.

More Telugu News