Lover: ప్రియురాలు పెళ్లికి నో చెప్పిందని... ఐటీ కంపెనీ ఎండీ ఆత్మహత్య!

  • శ్రీ సాయితి టెక్‌ మల్టీనేషనల్‌ ఎండీగా నిఖిల్ రెడ్డి
  • తన కార్యాలయంలోని ఉద్యోగినితో ప్రేమలో
  • ఆమె కాదన్నదని చీరతో ఉరేసుకుని ఆత్మహత్య

తానెంతగానో ప్రేమించిన యువతి, పెళ్లి చేసుకునేందుకు నిరాకరించిందన్న మనస్తాపంతో ఓ సాఫ్ట్ వేర్ కంపెనీ ఎండీ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హైదరాబాద్ లోని అమీర్ పేటలో జరిగిన ఈ ఘటనపై పోలీసులు వెల్లడించిన మరింత సమాచారం ప్రకారం, నాచారం ప్రాంతానికి చెందిన నిఖిల్‌ రెడ్డి (27) అనే యువకుడు, శ్రీ సాయితి టెక్‌ మల్టీనేషనల్‌ కంపెనీలో మేనేజింగ్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

అదే కంపెనీలో పనిచేస్తున్న ఓ యువతిని రెండు సంవత్సరాలుగా ప్రేమించాడు. ఆమె వద్ద పెళ్లి ప్రస్తావన తెచ్చాడు. అయితే, తాను వివాహం చేసుకోబోనని ఆమె చెప్పింది. దీంతో మనస్తాపానికి గురైన నిఖిల్, తన ఆఫీసులోనే చీరతో ఫ్యాన్ కు ఉరేసుకున్నాడు. ఇది గమనించిన ఆఫీస్ సిబ్బంది ఎస్ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు నిఖిల్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నామని వెల్లడించారు.

More Telugu News