Keerthi: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • నాగార్జున సినిమాలో కీర్తి సురేశ్ 
  • గోపీచంద్ షూటింగుకి రెడీ 
  • సంపత్ నంది దర్శకత్వంలో కల్యాణ్ రామ్  

*  అక్కినేని నాగార్జున హీరోగా రాహుల్ రవీంద్రన్ రూపొందిస్తున్న 'మన్మథుడు 2'లో కీర్తి సురేశ్ కూడా ఓ నాయికగా నటిస్తోంది. ఈ విషయాన్ని తాజాగా దర్శకుడు ప్రకటించాడు. ఇప్పటికే ఇందులో రకుల్ ప్రీత్ సింగ్ ప్రధాన కథానాయికగా నటిస్తున్న సంగతి విదితమే.
*  గోపీచంద్ హీరోగా తిరు సుబ్రహ్మణ్యం దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం తదుపరి షెడ్యూల్ షూటింగ్ ఈ నెల 7 నుంచి హైదరాబాదులో జరుగుతుంది. గతంలో ఈ చిత్రం షూటింగులో గోపీచంద్ గాయపడడం వల్ల ఇన్నాళ్లూ షూటింగ్ ఆగిపోయింది.
*  ప్రస్తుతం 'తుగ్లక్' సినిమాలో నటిస్తున్న నందమూరి కల్యాణ్ రామ్ మరో చిత్రానికి కూడా ఓకే చెప్పాడు. ఈ చిత్రానికి సంపత్ నంది దర్శకత్వం వహిస్తాడు. ఇందుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి.

More Telugu News