Harish Rao: ఈ విజయం మా బాధ్యతను మరింత పెంచింది: హరీశ్ రావు

  • విజయానికి కారకులైన ప్రజలకు ధన్యవాదాలు
  • ప్రభుత్వంపై నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు
  • ఇది తెలంగాణ ప్రజల విజయం

పరిషత్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంది. ముఖ్యంగా సిద్దిపేటలో క్లీన్ స్వీప్ చేసేసింది. ఈ విజయదుందుభిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు స్పందించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జడ్పీ స్థానాలనూ కైవసం చేసుకున్నామని స్పష్టం చేశారు.

టీఆర్ఎస్ ఘన విజయానికి కారకులైన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ విజయంతో టీఆర్ఎస్ ప్రభుత్వంపై నమ్మకాన్ని ప్రజలు మరోసారి నిరూపించారని, వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని హరీశ్ పేర్కొన్నారు. ఈ విజయం తమ బాధ్యతను మరింత పెంచిందని, ఇది తెలంగాణ ప్రజల విజయమని హరీశ్ రావు పేర్కొన్నారు.

More Telugu News