kangana: 'తలైవి' సినిమా బడ్జెట్ 100 కోట్లు

  • జయలలిత బయోపిక్ గా 'తలైవి'
  • ప్రధాన పాత్రధారిగా కంగనా రనౌత్ 
  • దర్శకుడిగా ఏ.ఎల్. విజయ్  

ప్రముఖ కథానాయిక .. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత జీవిత చరిత్రను తెరకెక్కించడానికి కొంతమంది దర్శక నిర్మాతలు రంగంలోకి దిగారు. వాళ్లలో దర్శకుడు ఏ.ఎల్.విజయ్ ప్రాజెక్టు చకచకా ముందుకువెళుతోంది. ప్రధాన పాత్రధారిగా ఆయన కంగనా రనౌత్ ను తీసుకున్నాడు. దాంతో అంతా ఈ సినిమా బడ్జెట్ పై ఆసక్తిని చూపుతున్నారు.

100 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారనేది తాజా సమాచారం. కథానాయికగాను .. ముఖ్యమంత్రిగాను జయలలిత జీవితంలో ఎన్నో అనూహ్యమైన మలుపులు వున్నాయి. కథానాయికగా మారిన దగ్గర నుంచి ఆమె జీవితం ఎంతో విలాసవంతంగా గడిచింది. ఆ విలాసవంతమైన జీవితాన్ని తెరపై ఆవిష్కరించడానికి పెద్ద మొత్తంలోనే ఖర్చు అవుతుంది. కంగనా రనౌత్ కి గల క్రేజ్ ను .. జయలలిత పట్ల ప్రజలకి గల అభిమానాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాను వివిధ భాషల్లో విడుదల చేయనున్నారు. అందువలన 100 కోట్ల బడ్జెట్ పెట్టినా టెన్షన్ పడవలసిన అవసరం లేదని నిర్మాతలు భావిస్తున్నారట.

More Telugu News