Smart Phone: రూపు మార్చుకున్న సెల్ఫీ కెమెరా... తొలిసారి చూపిన ఒప్పో, షియోమి!

  • వచ్చేస్తున్న అండర్‌ డిస్‌ ప్లే సెల్ఫీ కెమెరా స్క్రీన్
  • నాచ్ లేకుండా పూర్తి స్క్రీన్ తో స్మార్ట్ ఫోన్లు
  • తయారు చేస్తున్నామన్న ఒప్పో షియోమి

సెల్ఫీ కెమెరా రూపు మారబోతోంది. ఇప్పటివరకూ పైకి కనిపించే కెమెరాలు, ఇకపై డిస్ ప్లే స్క్రీన్ వెనక్కు వెళ్లిపోనున్నాయి. తాము తయారు చేసిన అత్యాధునిక స్మార్ట్ ఫోన్లను ఒప్పో, షియోమీలు తొలిసారిగా చూపించాయి. తొలుత బెజిల్‌ స్క్రీన్‌ పై, ఆ తరువాత నాచ్‌ డిస్‌ ప్లే, వాటర్‌ డ్రాప్‌ డిస్‌ ప్లే అంటూ పలురకాల స్క్రీన్లు ఇప్పటికే మార్కెట్లోకి వచ్చాయి.

ఇక ఇప్పుడు రానున్నది అండర్‌ డిస్‌ ప్లే సెల్ఫీ కెమెరా స్క్రీన్. అంటే ఎటువంటి నాచ్‌ కనిపించదు. పూర్తి స్క్రీన్‌ తో స్మార్ట్ ఫోన్లు రానున్నాయి. చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ సంస్థ ఒప్పో వైస్‌ ప్రెసిడెంట్‌ బ్రెయిన్‌ షెన్‌ అండర్‌ డిస్‌ప్లే సెల్ఫీ కెమెరా స్క్రీన్ తో తాము అభివృద్ధి చేసిన స్మార్ట్ ఫోన్ వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేశారు. షియోమీ సైతం తాము అండర్‌ డిస్‌ప్లే సెల్ఫీ కెమెరాను తయారు చేస్తున్నామని ప్రకటించింది. సంస్థ ప్రెసిడెంట్‌ లిన్‌ బిన్‌ అందుకు సంబంధించిన వీడియోను పోస్ట్‌ చేశారు. కాగా, ఈ ఫోన్లు ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తాయన్న విషయాన్ని మాత్రం రెండు కంపెనీలూ వెల్లడించలేదు.

More Telugu News