Rajasthan: ఆలయానికి వెళుతున్న వివాహితపై సామూహిక అత్యాచారం.. సోషల్ మీడియాలో వీడియో!

  • స్నేహితురాలితో కలిసి వెళుతున్న మహిళను అటకాయించిన నిందితులు
  • నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం
  • నలుగురు నిందితుల అరెస్ట్

ఆలయానికి వెళుతున్న మహిళను అడ్డగించి నిర్జన ప్రదేశంలోకి లాక్కెళ్లిన ఐదుగురు యువకులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అత్యాచార ఘటనను వీడియో తీసిన యువకులు దానిని సోషల్ మీడియాలో పెట్టడంతో కలకలం రేగింది. రాజస్థాన్‌లోని పాలి జిల్లాలో జరిగిందీ ఘటన.

పోలీసుల కథనం ప్రకారం.. గత నెల 26న ఓ వివాహిత తన స్నేహితురాలితో కలిసి ఆలయానికి వెళుతుండగా ఐదుగురు యువకులు వారిని అడ్డగించి వివాహితను బలవంతంగా ఈడ్చుకెళ్లారు. నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ సందర్భంగా తీసిన వీడియోను సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అయింది.

బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు వీడియో ఆధారంగా నలుగురు నిందితులు జితేంద్ర భట్‌ (20), గోవింద్‌ భట్‌ (20), దినేశ్‌ భట్‌ (24), మహేంద్ర భట్‌ (22)లను అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరో నిందితుడు సంజయ్‌ భట్‌‌ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

More Telugu News