Cricket: ఇంగ్లాండ్ పై శుభారంభం అందించిన పాక్ ఓపెనర్లు

  • తొలి వికెట్ కు 82 పరుగులు జోడింపు
  • టాస్ గెలిచిన పాక్ కు బ్యాటింగ్ అప్పగించిన ఇంగ్లాండ్
  • నాటింగ్ హామ్ వేదికగా మ్యాచ్

ఐసీసీ వరల్డ్ కప్ లో భాగంగా వెస్టిండీస్ తో ఆడిన తొలి మ్యాచ్ లో పాకిస్థాన్ బ్యాటింగ్ ఎంత దారుణంగా ఉందో అందరికీ తెలిసిందే. అయితే ఇవాళ ఇంగ్లాండ్ తో మ్యాచ్ లో మాత్రం పాకిస్థాన్ జాగ్రత్తగా ఆడుతోంది. ఓపెనర్లు తొలి వికెట్ కు 82 పరుగులు జోడించి శుభారంభం అందించారు. 36 పరుగులు చేసిన ఫఖార్ జమాన్ మొదటి వికెట్ రూపంలో వెనుదిరిగాడు. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆతిథ్య ఇంగ్లాండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ పోరుకు నాటింగ్ హామ్ ఆతిథ్యమిస్తోంది. ప్రస్తుతం క్రీజులో ఓపెనర్ ఇమాముల్ హక్ (38 బ్యాటింగ్)కు తోడుగా బాబర్ అజామ్ ఆడుతున్నాడు. ప్రస్తుతం పాక్ స్కోరు 16 ఓవర్లలో వికెట్ నష్టానికి 90 పరుగులు.

More Telugu News