psyco killer srinivasareddy: సైకో కిల్లర్‌ శ్రీనివాసరెడ్డి ఆ జంటనూ చంపేశాడా?

  • అవుననే చెబుతున్నారు గ్రామస్థులు
  • ఆరాతీస్తున్న పోలీసులు
  • మామిడి తోటలో పనికోసం వరంగల్‌ నుంచి వచ్చిన జంట

వరుస హత్యలతో భయోత్పాతం సృష్టించిన హాజీపూర్‌ సైకో కిల్లర్‌ శ్రీనివాసరెడ్డిని విచారిస్తున్న కొద్దీ పోలీసులకు నమ్మలేని నిజాలు తెలుస్తున్నాయి. శ్రీనివాసరెడ్డి చంపేసిన వారిలో వరంగల్‌ జిల్లాకు చెందిన ఓ జంట కూడా ఉందని తాజాగా వెలుగు చూసింది. మామిడి తోటల్లో  పనికి కుదుర్చుతానని వరంగల్‌ జిల్లా నుంచి ఓ జంటను శ్రీనివాసరెడ్డి తీసుకువచ్చాడు. అయితే అది వీలుకాకపోవడంతో కొన్నాళ్లపాటు తనతోపాటు లిఫ్ట్‌ మెకానిక్‌ పనుల్లో వారి సాయం తీసుకున్నాడు. ఆ తర్వాత ఆ జంట కనిపించకుండా పోయారని గ్రామస్థులు చెబుతున్నారు. శ్రీనివాసరెడ్డే వారిని చంపేసి మాయం చేసి ఉంటాడని అనుమానం వ్యక్తం చేయడంతో ఆ దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శ్రీనివాసరెడ్డి నుంచి కీలక సమాచారం సేకరిస్తున్నట్లు సమాచారం. శ్రీనివాసరెడ్డి ఫోన్లో ఎక్కువగా అశ్లీల వెబ్‌సైట్‌ల కోసం వెతికినట్టు గుర్తించారు.

More Telugu News