nagashourya: 'అశ్వద్ధామ'గా రానున్న నాగశౌర్య

  • సొంతబ్యానర్లో నాగశౌర్య మూవీ
  •  కథానాయికగా మెహ్రీన్ 
  • త్వరలో రానున్న ఫస్టులుక్

ఒక వైపున ఇతర బ్యానర్లలో సినిమాలు చేస్తూనే, మరో వైపున తన సొంత బ్యానర్లోను నాగశౌర్య సినిమాలు చేస్తూ వెళుతున్నాడు. ప్రస్తుతం ఆయన తన బ్యానర్లో ఒక సినిమా చేస్తున్నాడు. విభిన్నమైన కథాకథనాలతో రూపొందుతోన్న ఈ సినిమాకి ఆయన 'అశ్వద్ధామ' అనే టైటిల్ ను ఖరారు చేశాడు.

ఈ టైటిల్ ను ఆయన రిజిస్టర్ కూడా చేయించాడు. అందువలన ఈ టైటిల్ ఖాయమైపోయినట్టేనని అంటున్నారు. ఈ సినిమా ద్వారా దర్శకుడిగా రమణతేజ పరిచయమవుతున్నాడు. నాగశౌర్య సరసన కథానాయికగా మెహ్రీన్ నటిస్తోన్న ఈ సినిమా, ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. త్వరలోనే ఫస్టులుక్ ను వదిలే ఆలోచనలో వున్నారు.

More Telugu News