Cricket: ఇండియా, ఇంగ్లండ్ లకు ఒకే ఒక ఓటమి... ఆస్ట్రేలియాకు 3, న్యూజిలాండ్ కు 4... బ్రెండన్ మెకల్లమ్ జోస్యం వైరల్!

  • కాగితంపై రాసి ముందే సోషల్ మీడియాలో ఉంచిన మెకల్లమ్
  • తొలి రెండు రోజుల్లో అంచనాల ప్రకారమే ఫలితాలు
  • సెమీకు చేరేది ఇండియా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ అట!

వరల్డ్ కప్ క్రికెట్ పోటీలు జోరుగా సాగుతున్న వేళ, న్యూజిలాండ్ మాజీ స్టార్ ప్లేయర్ బ్రెండన్ మెకల్లమ్ జోస్యం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. లీగ్ మ్యాచ్ లు సుదీర్ఘంగా సాగనుండగా, ఏ జట్టు ఎవరెవరిపై గెలుస్తుందో చెబుతూ కాగితంపై ముందే రాసుకున్న మెకల్లమ్, దాన్ని సోషల్ మీడియాలో ఉంచారు. ఆయన అంచనాల ప్రకారమే తొలి రెండు రోజుల ఫలితాలు వచ్చాయి. ఇంకేముంది అందరూ ఈ కాగితాన్ని చూసేస్తున్నారు.

ఇక దీనిలో ఇండియా, ఇంగ్లండ్ జట్లు లీగ్ దశలో ఒక్కో మ్యాచ్ లో మాత్రమే ఓడిపోతాయని మెకల్లమ్ అంచనా వేశారు. ఇండియా జట్టు ఇంగ్లండ్ చేతిలో, ఇంగ్లండ్ జట్టు ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోతాయని జోస్యం చెప్పారు. మిగతా అన్ని జట్లపై ఈ రెండు విజయాలను నమోదు చేసి సెమీస్ కు చేరుతాయన్నారు.

ఆస్ట్రేలియా జట్టు వెస్టిండీస్, ఇండియా, పాకిస్థాన్ లపై ఓడిపోతుందని, న్యూజిలాండ్ జట్టు ఇండియా, పాకిస్థాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ లపై ఓడిపోనుందని అన్నారు. ఇక వెస్టిండీస్ జట్టు సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఇండియా జట్లతో జరిపే పోరులో ఓటమి పాలవుతుందని జోస్యం చెప్పారు. మిగతా జట్లలో సౌతాఫ్రికా, పాకిస్థాన్ లు నాలుగేసి ఓటములతో, ఆఫ్షనిస్తాన్ 7 ఓటములతో, శ్రీలంక, బంగ్లాదేశ్ లు 8 ఓటములతో ముగిస్తాయని అన్నారు.

More Telugu News