Actor Ravi kishan: తనని తాను అర్జునుడిగా అభివర్ణించుకున్న బీజేపీ ఎంపీ, సినీ నటుడు రవికిషన్!

  • ఆదిత్యనాథ్ కృష్ణుడు
  • గోరఖ్‌పూర్‌ను దేశంలోనే అత్యున్నతంగా తీర్చిదిద్దుతా
  • ఫిలిం సిటీని నిర్మించి యువతకు ఉపాధి కల్పిస్తా

ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ ఎంపీ, భోజ్‌పురి సినీ నటుడు రవికిషన్ తనను తాను అర్జునుడిగా అభివర్ణించుకున్నారు. తాజాగా ఓ వార్త సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రవికిషన్ మాట్లాడుతూ.. గోరఖ్‌పూర్‌ను దేశంలోనే అత్యున్నత నగరంగా తీర్చిదిద్దుతానని అన్నారు. యూపీ సీఎం ఆదిత్యనాథ్ కృష్ణుడైతే తాను అర్జునుడినని పేర్కొన్నారు. యోగి నేతృత్వంలో గోరఖ్‌పూర్ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. నగరంలో ఆరు ఫ్లైఓవర్లు నిర్మిస్తానని, అలాగే ఓ ఫిలిం సిటీని అభివృద్ధి చేసే ఆలోచన కూడా ఉందని అన్నారు. తద్వారా యూపీ, బీహార్, జార్ఖండ్ యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని రవికిషన్ పేర్కొన్నారు.

More Telugu News