Suryapet: సూర్యాపేట జిల్లాలో సీపీఎం కార్యకర్త దారుణ హత్య

  • కత్తులతో నరికి చంపిన దుండగులు
  • మృతుడు ఓ హత్య కేసులో నిందితుడు
  • కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు

సూర్యాపేట జిల్లాలో సీపీఎం కార్యకర్త దారుణ హత్య కలకలం రేపుతోంది. పెన్‌పహాడ్ మండలం నాగులపాటి అన్నారంలో నకిరేకంటి వెంకటేశ్వర్లు అనే  సీపీఎం కార్యకర్తను కత్తులతో నరికి చంపారు. మృతుడు వెంకటేశ్వర్లు ఓ హత్య కేసులో నిందితుడిగా తేలింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు  ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

More Telugu News