Cricket: బ్యాటింగ్ కు ముందు టాయిలెట్లో దూరుతున్న టీమిండియా క్రికెటర్.. సహచరుడిలో అసహనం!

  • ధావన్ పై రోహిత్ వ్యాఖ్యలు
  • సహచరుడి వింత అలవాటు గురించి చెప్పిన రోహిత్
  • టీవీ షోలో పాల్గొన్న టీమిండియా ఓపెనర్లు

భారత క్రికెట్ జట్టులో రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ జంట ఎంతో విజయవంతమైన జోడీగా పేరుతెచ్చుకుంది. టీమిండియా ఓపెనర్లుగా వీరిద్దరూ ఎన్నో విజయాల్లో పాలుపంచుకున్నారు. అయితే, శిఖర్ ధావన్ గురించి ఎవరికీ తెలియని విషయాన్ని రోహిత్ ఓ టీవీ షోలో వెల్లడించాడు. మ్యాచ్ స్టార్ట్ అవడానికి ఐదు నిమిషాల ముందే మైదానంలో అడుగుపెట్టాలని తాను భావిస్తానని, కానీ ధావన్ ఆ సమయానికి టాయిలెట్లో ఉంటాడని వివరించాడు.

"ప్రతి మ్యాచ్ లోనూ బ్యాటింగ్ కు దిగేముందు టాయిలెట్ కు వెళ్లడం ధావన్ కు అలవాటు. ఓపెనర్లు ఎప్పుడైనా కలిసే మైదానంలో అడుగుపెట్టాలి, అది క్రికెట్ ఆనవాయితీ. కానీ, ధావన్ కోసం వేచిచూసి చూసి నాకు ఒక్కోసారి విసుగు వస్తుంది. మైదానంలోకి ముందుగా వెళ్లి పరిస్థితులను ఆకళింపు చేసుకోవాలని నేను భావిస్తాను. ఎందుకుంటే ఏ మ్యాచ్ లోనైనా తొలి బంతి ఆడేది నేనే కాబట్టి. ధావన్ మాత్రం టాయిలెట్లో దూరి నాకు చిరాకుపుట్టిస్తాడు" అంటూ వివరించాడు.  ఈ విషయాలు చెబుతున్నప్పుడు ధావన్ కూడా రోహిత్ శర్మ పక్కనే ఉన్నాడు.

More Telugu News