Telangana: ఉద్యమ స్ఫూర్తితో తెలంగాణ సర్కారు పనిచేయాలి.. రాష్ట్రానికి నావంతు సహకారం అందిస్తా!: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

  • తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు
  • రాష్ట్రం అభివృద్ధిపథంలో కొనసాగాలని కోరుకుంటున్నా
  • ప్రకటనను విడుదల చేసిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, బీజేపీ నేత కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ‘అన్ని వర్గాలు, పక్షాల పోరాటంతో ఏర్పడిన తెలంగాణ అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నా. ఉద్యమంలో కలిసి పనిచేసిన స్పూర్తిని కొనసాగిస్తూ తెలంగాణ అభివద్ధిలో కూడా అన్ని వర్గాల ప్రజలను భాగస్వామ్యం చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. ఆ దిశలో తెలంగాణ ప్రభుత్వం కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నా.

నరేంద్రమోదీ ప్రధానిగా రెండోసారి ఎన్నికైన సందర్భంగా చూపించిన సమాఖ్య స్ఫూర్తితో, రాజ్యాంగం కల్పించిన హక్కులు-బాధ్యతల ఆధారంగా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నాం. మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి అన్నిరకాల సహాయసహకారాలు అందించడానికి సిద్ధంగా ఉంది. అందుకు కేంద్రమంత్రిగా నా వంతు కృషి చేస్తానని తెలంగాణ ప్రజలకు మాటిస్తున్నా’ అని కిషన్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.

More Telugu News