Jagan: జగన్ తీవ్ర కసరత్తు... మంత్రి పదవుల చాన్స్ వీరికే!

  • జిల్లాకు రెండు చొప్పున మంత్రిపదవులకు చాన్స్
  • అన్ని వర్గాలకూ ప్రాతినిథ్యం కల్పించేందుకు జగన్ ప్రయత్నాలు
  • ఇప్పటికే కొందరి పేర్లు ఖరారు

మరో నాలుగైదు రోజుల్లో మంత్రి మండలిని విస్తరించాలని భావిస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, అన్ని వర్గాలకూ, అన్ని జిల్లాలకు సమానమైన ప్రాతినిథ్యం కల్పించేలా నూతన మంత్రులను తీసుకోవాలని భావిస్తున్నారు. ఇందుకోసం విజయసాయి రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి తదితరులతో ఆయన తీవ్రమైన కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే మంత్రి పదవుల విషయంలో కొందరి పేర్లు ఖరారు కాగా, మరికొందరి పేర్లు పరిశీలనలో ఉన్నాయని సమాచారం.

ఇక మంత్రి పదవులు దక్కవచ్చని భావిస్తున్న వారి జాబితాలో శ్రీకాకుళం జిల్లా నుంచి ధర్మాన ప్రసాదరావు (వెలమ - బీసీ), కంబాల జోగులు (ఎస్సీ), తమ్మినేని సీతారాం (కళింగ - బీసీ)లున్నారు. విజయనగరం జిల్లా నుంచి బొత్స సత్యనారాయణ (తూర్పు కాపు - బీసీ), కే వీరభద్రస్వామి (ఓసీ - వైశ్య) ఉండగా, తూర్పు గోదావరి జిల్లా నుంచి పిల్లి సుభాష్ చంద్రబోస్ (బీసీ), విశ్వరూప్ (ఎస్సీ), దాడిశెట్టి రాజా (ఓసీ - కాపు), పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ప్రసాదరాజు (ఓసీ రాజు), గ్రంధి శ్రీనివాస్ (ఓసీ - కాపు), కృష్ణా జిల్లా నుంచి కొడాలి నాని (ఓసీ - కమ్మ), పార్థసారధి (బీసీ - యాదవ), పేర్ని నాని (ఓసీ - కాపు), సామినేని ఉదయభాను (ఓసీ - కాపు) ఉన్నారు.

గుంటూరు జిల్లా నుంచి మేకతోటి సుచరిత (ఎస్సీ), మర్రి రాజశేఖర్ (ఓసీ - కమ్మ), ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఓసీ - రెడ్డి), అంబటి రాంబాబు (ఓసీ - కాపు), ప్రకాశం జిల్లా నుంచి బాలినేని శ్రీనివాస్ రెడ్డి (ఓసీ - రెడ్డి), ఆదిమూలపు సురేశ్ (ఎస్సీ), నెల్లూరు జిల్లా నుంచి మేకపాటి గౌతమ్ రెడ్డి (ఓసీ - రెడ్డి), అనిల్ కుమార్ యాదవ్ (బీసీ), కాకాని గోవర్ధన్ రెడ్డి (ఓసీ - రెడ్డి), చిత్తూరు జిల్లా నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (ఓసీ - రెడ్డి), రోజా (ఓసీ - రెడ్డి) పేర్లు పరిశీలనలో ఉన్నాయి.

ఇక కడప జిల్లాకు వస్తే అంజాద్ బాషా (ముస్లిం) పేరు వినిపిస్తోంది. అనంతపురం జిల్లా నుంచి అనంత వెంకట్రామిరెడ్డి (ఓసీ - రెడ్డి), శంకర్ నారాయణ (బీసీ - కురుమ), కాపు రామచంద్రారెడ్డి (బీసీ - వీరశైవ), కర్నూలు జిల్లా నుంచి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి (ఓసీ - రెడ్డి), శిల్పా చక్రపాణి రెడ్డి (ఓసీ - రెడ్డి)లకు మంత్రి పదవులు దక్కే అవకాశాలున్నాయి. ఏపీ క్యాబినెట్ లో మొత్తం 26 మందికి స్థానం ఉండగా, జగన్ ను మినహాయిస్తే, మరో 25 మందిని మంత్రులుగా తీసుకునే అవకాశాలున్నాయి.

More Telugu News