Narasimhan: అంబులెన్స్ ఫస్ట్.. తమ వాహనాలను ఆపి దారిచ్చిన గవర్నర్!

  • రాజ్ భవన్ లో గవర్నర్ ఇఫ్తార్ విందు 
  • రాజ్‌భవన్‌కు వెళ్లే దారిలో వాహనాల నిలిపివేత
  • ట్రాఫిక్‌లో అంబులెన్స్ చిక్కుకోవడాన్ని గమనించి స్పందించిన గవర్నర్

రంజాన్ మాసం సందర్భంగా నేడు గవర్నర్ రాజ్‌భవన్‌లో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనికి ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. అయితే ఈ విందులో పాల్గొనేందుకు గవర్నర్‌తో పాటు సీఎంలు కేసీఆర్, జగన్‌లు సంస్కృతి భవనం వద్దకు వెళుతుండగా ఓ ఆసక్తికర సన్నివేశం జరిగింది.

పోలీసులు రాజ్‌భవన్‌కు వెళ్లే దారిలో ట్రాఫిక్‌ను నిలిపివేశారు. ఆ సమయంలో ట్రాఫిక్‌లో ఓ అంబులెన్స్ చిక్కుకోవడాన్ని గమనించిన గవర్నర్ తమ వాహనాలను నిలిపివేసి అంబులెన్స్‌ను పంపారు. అంబులెన్స్ వెళ్లిన అనంతరం గవర్నర్‌తో పాటు ముఖ్యమంత్రుల వాహనాలు బయల్దేరి రాజ్‌భవన్‌కు వెళ్లాయి.

More Telugu News