Elephant: కుటుంబ సభ్యులంతా నిద్రిస్తుండగా ఇంట్లోకి చొరబడి ఏనుగు బీభత్సం.. ఒకరి మృతి

  • ఇంటి గోడను కూల్చి లోపలికి ప్రవేశించిన ఏనుగు
  • దాడిలో ఓ కుమార్తె అక్కడికక్కడే మృతి
  • భార్య, మరో అమ్మాయికి తీవ్ర గాయాలు

కుటుంబ సభ్యులందరూ నిద్రిస్తుండగా ఇంట్లోకి చొరబడిన ఏనుగు బీభత్సం సృష్టించింది. ఈ ఘటన ఛత్తీస్ గడ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. అటవీశాఖ అధికారి కృష్ణ కుమార్‌ జాదవ్‌ తెలిపిన వివరాల ప్రకారం, ఆ రాష్ట్రంలోని జాష్‌పూర్ జిల్లాలో రామ్‌శ్యామ గ్రామంలోకి చొరబడిన ఒక ఏనుగు విశ్వనాథ్ చౌహాన్ అనే వ్యక్తికి సంబంధించిన ఇంటి గోడను కూల్చి లోపలికి ప్రవేశించింది. ఇంట్లో నిద్రిస్తున్న విశ్వనాథ్ కుమార్తె లలిత(17)పై ఏనుగు దాడి చేయడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనలో విశ్వనాథ్ భార్య మున్నీ బాయితో పాటు మరో కుమార్తె వర్ష(7) తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు.

More Telugu News