murali mohan: మురళీమోహన్ ని పరామర్శించిన మెగాస్టార్ చిరంజీవి

  • వెన్నెముకకు శస్త్ర చికిత్స చేయించుకున్న మురళీమోహన్
  • తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న టీడీపీ నేత
  • భార్యతో కలసి మురళీమోహన్ ఇంటికి వెళ్లిన చిరంజీవి

సినీ నటుడు, టీడీపీ మాజీ ఎంపీ మురళీమోహన్ ను మెగాస్టార్ చిరంజీవి పరామర్శించారు. మురళీమోహన్ ఇటీవలే వెన్నెముకకు శస్త్ర చికిత్స చేయించుకున్నారు. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయి, హైదరాబాదులో ఉన్న తన నివాసంలో ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో, తన భార్య సురేఖతో కలసి మురళీమోహన్ ఇంటికి చిరంజీవి వెళ్లారు. ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

More Telugu News