Balakrishna: ముస్లింలకు నందమూరి బాలకృష్ణ ఇఫ్తార్ విందు

  • భారీగా హాజరైన ముస్లింలు
  • సాయంత్రం హిలాల్ నిర్వహణ
  • ప్రార్థనల్లో పాల్గొన్న బాలకృష్ణ

 టీడీపీ శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ముస్లింలకు హిందూపురంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ సాయంత్రం ఆరింటికి హిలాల్ కార్యక్రమంలో ముస్లింలతో కలిసి ప్రార్థనలు నిర్వహించిన బాలయ్య ఆపై ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన ముస్లింల రంజాన్ ఉపవాస దీక్షలు ఫలవంతం కావాలని ఆకాంక్షించారు. ఈ విందులో టీడీపీ కార్యకర్తలు, స్థానిక నాయకులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. ఇఫ్తార్ విందులో బాలయ్య కూడా ముస్లింల తరహాలో కుర్తా, పైజామా, తలపై టోపీతో కనిపించారు.

More Telugu News